Ashok Gehlot | కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తప్పుకున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠం ఉంటుందా? ఊడుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. మరో రెండు రోజుల్లో రాజస్థాన్ సీఎంపై సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఆయన అధ్యక్ష ఎన్నికలపై సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు సాయంత్రం వరకు సమయం ఇస్తే జాబితా మీ ముందుంటుందని తెలిపారు.
రాజస్థాన్లో మద్దతుదారుల వైఖరితో అశోక్ గెహ్లాట్ను సమస్యలు చుట్టుముట్టాయి. సీఎం అభ్యర్థిగా సచిన్ పైలట్ను గెహ్లాట్ వర్గం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్గా తీసుకున్నది. సీడబ్ల్యూసీ సభ్యులు సైతం ఆయనను అధ్యక్ష రేసు నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మరో వైపు అశోక్ గెహ్లాట్ ఇవాళ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. భేటీ అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాజస్థాన్లో జరిగిన పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. అలా జరిగి ఉండాల్సింది కాదన్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికలకు దూరంగా ఉండడంతో.. తాను బరిలో ఉండాలనుకున్నానని.. అయితే, ఎన్నికల్లో తాను పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బాంబు పేల్చారు. డియాతో మాట్లాడిన వేణుగోపాల్ రాజస్థాన్ సీఎంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అయితే, గెహ్లాట్పై సోనియా అసంతృప్తితో ఉన్నారని, ఇది సచిన్ పైలట్కు అనుకూలంగా ఉండవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరో వైపు గెహ్లాట్ అనుకూల ఎమ్మెల్యేలు మాత్రం పైలట్ను సీఎం చేస్తే.. తామంతా రాజీనామాలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనియా నిర్ణయం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.