రంగారెడ్డి జిల్లా కోర్టులు, మార్చి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ న్యాయమూర్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రంగారెడ్డి జిల్లా అదనపు న్యాయమూర్తి జీ రాజగోపాల్ ఎన్నికయ్యారు. ఇంతవరకు ఆ పదవిలో ఉన్న ప్రభుత్వ న్యాయకార్యదర్శి ఏ సంతోష్రెడ్డి పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దీంతో సంఘం కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నది. ఉపాధ్యక్షులుగా ప్రభాకర్రావు, బీ సత్తయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. కోర్టుల్లో ప్రజలకు సత్వర న్యాయం లభించేలా కృషిచేస్తానని తెలిపారు. న్యాయాధికారులకు మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడుతామని ఉపాధ్యక్షుడు బీ సత్తయ్య చెప్పారు. ఈ సమావేశంలో పలువురు న్యాయాధికారులు, అధికారులు పాల్గొన్నారు.