చార్మినార్, ఫిబ్రవరి 28: హైదరాబాద్లోని లాల్దర్వాజకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి రాహుల్ గుప్తా ఉక్రెయిన్లో చిక్కుకొన్నాడు. ఆ దేశంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల్లో స్వదేశానికి వచ్చేందుకు సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రాణభయంతో తోటి విద్యార్థులతో ఓ బంకర్లో తలదాచుకొన్నాడు. దీంతో వీలైనంత త్వరగా తమ కుమారుడితో పాటు, భారతీయ విద్యార్థులందర్నీ స్వదేశానికి చేర్చాలని రాహుల్ తండ్రి వేణుగోపాల్ గుప్తా వేడుకొంటున్నారు. రాహుల్ కోసం అతడి తల్లి నిద్రాహారాలు మానేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా ‘అణు’ ఆదేశాలతో కుటుంబమంతా మరింత ఆందోళన చెందుతున్నట్టు పేర్కొన్నారు.