మన క్రికెట్ జట్టులో ధోని ఎంత కీలకంగా ఉండేవారో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో నా పాత్ర అంత ప్రాధాన్యతతో ఉంటుందని చెబుతున్నారు నటి రాధిక శరత్కుమార్. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చ్ 4న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలు తెలిపారు రాధిక. ఆమె మాట్లాడుతూ…‘హీరో చుట్టూ మహిళలకు ప్రాధాన్యమిస్తూ అల్లుకున్న కథ ఇది. నా కెరీర్లో ఇలాంటి సబ్జెక్ట్ చేయడం తొలిసారి. హీరోకు తల్లి పాత్రలో నటించాను. మన క్రికెట్ జట్టులో ధోని ఎంత కీలకంగా ఉండేవారో నా పాత్ర అలా వ్యవహరిస్తూ కథను ముందుకు నడిపిస్తుంది, ఎక్కువగా కామెడీ చేయకుండా సెటిల్డ్గా ఉండే క్యారెక్టర్ నాది. శర్వానంద్, రష్మిక పరిణితిగల నటన చూపిస్తారు’ అని చెప్పింది.