‘గోపీకృష్ణా మూవీస్ ఎన్నో విజయవంతమైన సినిమాల్ని నిర్మించింది. అందుకే ‘రాధేశ్యామ్’ విషయంలో కాస్త టెన్షన్గా అనిపించింది. కోవిడ్ సమయంలో నిర్మాతలు, మా టీమ్ అంతా చాలా కష్టపడి పని చేశారు’ అన్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకులముందుకురానుంది. గురువారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అభిమానులు ట్రైలర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ ‘ జార్జియా, ఇటలీలో షూటింగ్ చేశాం. దర్శకుడు ఐదు సంవత్సరాలు ఓ సినిమా కోసం పనిచేయడమంటే సాధారణ విషయం కాదు. ఆ ప్రతిఫలం ట్రైలర్లో కనిపిస్తున్నది. ఈ సినిమాలో ఎన్నో మలుపులు ఉంటాయి. ైక్లెమాక్స్ ప్రత్యేకార్షణగా ఉంటుంది. పాటలకు అద్భుతమైన బాణీలు కుదిరాయి. అభిమానులందరికి ఓ పండగలా ఉంటుంది’ అన్నారు.
కృష్ణంరాజు మాట్లాడుతూ ‘రెబల్స్టార్స్ ఎప్పుడూ రెబల్గానే ఉంటారు. ప్రభాస్ మరో యాభైఏళ్లు ఇండస్ట్రీలో రాణిస్తాడు’ అన్నారు. ‘ఆదిపురుష్’ చిత్ర దర్శకుడు ఓంరౌత్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చూస్తుంటే ప్రేమకథకు మించిన ఉత్కంఠభరితమైన అంశాలుంటాయని అర్థమవుతుంది’ అన్నారు. నాగ్అశ్విన్ మాట్లాడుతూ ‘మొదట పాన్ఇండియా ట్రెండ్ ప్రభాస్, రాజమౌళి ఆరంభించారు. ఆ పంథాలోనే మేము కొనసాగుతున్నాం. ‘రాధేశ్యామ్’ చూస్తుంటే ఇంటెన్స్ లవ్స్టోరీ అనిపిస్తోంది. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది’ అని చెప్పారు.
‘ఈ జనసందోహాన్ని చూస్తుంటే ప్రభాస్ అన్న అంటే అభిమానులకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది’ అని సందీప్రెడ్డి వంగా తెలిపారు. పూజాహెగ్డే మాట్లాడుతూ ‘నాలుగేళ్ల నుంచి ఈ సినిమాతో ప్రయాణం చేస్తున్నా. ఈ సినిమా కోసం సృష్టించిన ఫాంటసీ ప్రపంచం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. భావోద్వేగాలు కలబోసిన ఓ అందమైన ప్రేమకథగా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది’ అని చెప్పింది. దిల్రాజు మాట్లాడుతూ “బాహుబలి’తో పాన్ఇండియా స్టార్గా ఎదిగిపోయాడు ప్రభాస్. ఇప్పుడు మళ్లీ చక్కటి ప్రేమకథతో ముందుకువస్తున్నాడు. ట్రైలర్లో ఎమోషన్స్ బాగున్నాయి. ఏమాత్రం సందేహం లేకుండా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’ అన్నారు. దర్శకుడు రాధాకృష్ణకుమార్ మాట్లాడుతూ ‘ఈ సినిమా తీయడానికి నాలుగేళ్లు పట్టింది.
ఇండియాలో ఉన్న పెద్దపెద్ద రచయితల్ని సంప్రదించి కథ గురించి చర్చించాం. చివరకు ఈ కథ ప్రభాస్కు రాసిపెట్టుంది. ఫిలాసఫీ, లవ్స్టోరీ కలిపి ఈ కథ తయారుచేశాను. ఇందులో ఫైట్స్ ఉండవు కానీ ఓ అబ్బాయిఅమ్మాయి మధ్య జరిగే యుద్ధాలుంటాయి. ఓ అమ్మాయి కోసం అబ్బాయి సప్తసముద్రాలు దాటివెళ్లే తెగువ కనిపిస్తుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.