హైదరాబాద్: ఆన్లైన్లో గుర్రపు పందెం (Online Horse race) నిర్వహస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. ఇద్దరు నిర్వహుకులతో పాటు మొత్తం ఐదుగురిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.42 లక్షల నగదు, 2 ల్యాప్ టాప్లు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరించనున్నారు.