లక్నో: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో ఓటమి పాలైన స్టార్ షట్లర్ పీవీ సింధు.. మరో పోరుకు సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో తెలుగమ్మాయి టాప్ సీడ్గా బరిలోకి దిగనున్నది. కరోనా వైరస్ విజృంభణ మధ్య గత వారం ఢిల్లీ వేదికగా ముగిసిన ఇండియా ఓపెన్లో థాయ్లాండ్ షట్లర్ సుపనిడా కటెథాంగ్ చేతిలో ఓటమి పాలైన సింధు.. ఆ పరాజయాన్ని పక్కన పెట్టి ముందుకు సాగాలని చూస్తున్నది.
తొలి రౌండ్లో భారత్కే చెందిన తాన్యతో సింధు తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్లో ప్రపంచ చాంపియన్ లోహ్ కిన్పై సంచలన విజయంతో ఇండియా ఓపెన్ టైటిల్ పట్టిన లక్ష్యసేన్.. అలసట కారణంగా ఈ టోర్నీకి దూరం కాగా.. సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్, సౌరభ్ వర్మ, సమీర్ వర్మ, శుభంకర్ డే పోటీ పడుతున్నారు.