హైదరాబాద్, ఆట ప్రతినిధి: బళ్లారి(కర్ణాటక)వేదికగా జరిగిన జాతీయ సబ్జూనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ రెజ్లర్ పూర్ణిమ కాంస్య పతకంతో మెరిసింది. మహిళల 61కిలోల కేటగిరీ కాంస్య పతకపోరులో బరిలోకి దిగిన పూర్ణిమ.. ప్రత్యర్థిని మట్టికరిపించింది. గట్టిపట్టుతో పైచేయి సాధించిన ఈ తెలుగమ్మాయి కాంస్యం గెలుచుకుంది. ఇదే విభాగంలో నిఖిత (ఢిల్లీ), పల్లవి (మహారాష్ట్ర) వరుసగా స్వర్ణ, రజత పతకాలను దక్కించుకున్నారు.