చండీఘడ్: పంజాబ్లోని హోషియార్పూర్లో ఉన్న హరియానా పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఏఎస్ఐ సతీశ్ కుమార్ సర్వీస్ రివ్వాలర్తో తనను తాను కాల్చుకున్నాడు. సీనియర్ వేధించడం వల్ల తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు వీడియోలో ఆరోపించాడు. తండా పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్వోగా చేస్తున్న ఓంకార్ సింగ్ తన చావుకు కారణమని తెలిపాడు. తనిఖీ కోసం వచ్చిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తనను అన్యాయంగా తిట్టినట్లు ఆ ఏఎస్ఐ తన వీడియోలో పేర్కొన్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందే ఈ వీడియోను రిలీజ్ చేశాడు. అందరి ముందు అవమానించడం కన్నా తనను కాల్చి చంపినా బాగుండేదని ఆ వీడియోలో ఏఎస్ఐ తెలిపాడు. ప్రస్తుతం ఎస్హెచ్వోను ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే తన వద్దకు రావాలని హోషియార్పూర్ ఎస్పీ సర్తాజ్ సింగ్ చాహల్ జూనియర్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.