హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన పార్టీ ప్రతినిధులకు జ్యూట్ బ్యాగ్ కిట్లను అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధా న్యం ఇస్తూ సహజమైన జనపనారతో తయారుచేసిన కిట్లను అందించారు. ఈ కిట్లో పార్టీ కండువా, రెండు చిన్నసైజు జెండాలు, ఒక నోట్బుక్, పెన్ను, శానిటైజర్, మాస్కులు, ముసాయిదా తీర్మానాల పుస్తకం, విసనకర్ర, సంక్షేమ జెండా ప్రగతి ఎజెండా పుస్తకం, కేటీఆర్, కేసీఆర్ చిత్రపటాలున్న రెండు కీచైన్లు ఉన్నాయి. ఈ కిట్ల పంపిణీకి హైటెక్స్ ప్రాంగణంలో మొత్తం 32 కౌంటర్లు ఏర్పాటుచేశారు. జిల్లాలవారీగా నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఈ కిట్లను అందించారు.