నమస్తే తెలంగాణ నెట్వర్క్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. దేశంలో వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల్లోనూ ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ మహిళా విభాగం నేతృత్వంలో కేక్ కట్ చేశారు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కవిత అత్తగారి ఊరైన నిజామాబాద్ జిల్లా పొతంగల్లో ఎమ్మెల్యే షకీల్, జడ్పీ చైర్మన్ విఠల్, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్సాగర్, జాగృతి నేతలు గ్రామంలోని 80 మందికి సైకిళ్లను పంపిణీ చేశారు. నిజామాబాద్లోని కాకతీయ కళాశాల గోదావరి క్యాంపస్లో జరిగిన వేడుకల్లో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాంకిషన్ రావు హాజరై కేక్ కట్ చేశారు. హైదరాబాద్లోని మలక్పట అంధుల బాలికల హాస్టల్లో జాగృతి నాయకురాలు రజితరెడ్డితో కలిసి రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి కేక్ కట్ చేశారు. విద్యార్థినులకు పండ్లు పంపిణీ చేశారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్లో పలువురు పార్టీ నాయకులు అన్నదానాలు, చీరల పంపిణీ, పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ, కేక్ కటింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి మహారాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జాగృతి మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ సల్గె తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్లో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కవితకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేందర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంసృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ద్వారా విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమాల్లో వినయ్ సన్నీ, సాయిరాం ఉప్పు, రాజేశ్ రాపోలు, ప్రవీణ్ రెడ్డి, రవి, శ్రీకాంత్, సనీల్ రెడ్డి, ప్రవీణ్ లేదెళ్ల, సతీశ్ కుమార్, సంతు, సునీల్, చైతన్య, వెంకట్, ప్రసాద్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
దేశరాజధాని ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను తెలంగాణ సాయి వినూత్నంగా నిర్వహించారు. దేశ్కీ నేత కేసీఆర్.. హ్యాపీ బర్త్ డే కల్వకుంట్ల కవిత, సిస్టర్ ఫ్రం తెలంగాణ అన్న భారీ అక్షరాలతో రూపొందించిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మైనంపల్లి హన్మంతరావు తదితరుల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్సీ కవితకు ఆర్థిక మంత్రి హరీశ్రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా ‘హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని పేర్కొంటూ హరీశ్కు కవిత బొట్టు పెడుతున్న ఫొటోను జత చేశారు. దానికి థాంక్యూ బావ అని కవిత కృతజ్ఞతలు తెలిపారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆత్మీయ సోదరి కవితమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అని మంత్రి ట్వీట్ చేశారు. థాంక్యూ అన్న అని కవిత రిైప్లె ఇచ్చారు.
తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రోహిత్ దేశ రాజధాని ఢిల్లీ నగర శివారులో గగనతలంపై ప్రత్యేక చాపర్ ద్వారా బ్యానర్ను ప్రదర్శిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్కే చెందిన టీఆర్ఎస్ నాయకుడు చిన్నుగౌడ్.. మహాబలేశ్వర ఆలయంలోని ఆత్మలింగం సమీపాన అరేబియా మహాసముద్రంలో పది పడవల్లో కవిత ఫొటోలతో కూడిన గులాబీ రంగు జెండాలను ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపి ఆకట్టుకొన్నారు.