ఉడిపి: కర్నాటకలోని ఉడిపి జిల్లాలో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. హిజబ్ వేసుకుని అమ్మాయిలు కాలేజీలకు వస్తున్న నేపథ్యంలో.. అక్కడి విద్యార్థులు నిరసనగా కాషాయ కండువాలతో ఆందోళన చేపట్టారు. ఇవాళ ఉడిపిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. హిజబ్తో ముస్లిం మహిళలు కాలేజీకి రాగా.. వాళ్లకు ఎదురుగా విద్యార్థులు కాషాయ కండువాలు వేసుకుని నినాదాలు చేస్తూ వెళ్లారు. కాలేజీ క్యాంపస్లో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలోని కాలేజీల్లో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. హిజబ్ వేసుకుని ముస్లిం అమ్మాయిలు కాలేజీలకు రావడాన్ని స్థానిక విద్యాసంస్థలు నిషేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కర్నాటక హైకోర్టు హిజబ్ బ్యాన్ గురించి కేసును విచారించనున్నది.
మరోవైపు కర్నాటక హైకోర్టు ముందుకు ఈ కేసు వెళ్లింది. హిజబ్ ధరించిన అమ్మాయిలను క్లాస్రూమ్కు అనుమతించాలని కోర్టులో రెండు కేసులు దాఖలు చేశారు. హైకోర్టు వాటిని విచారణకు స్వీకరించింది. నిజానికి ఉడిపి కాలేజీలో మొదట్లో ఆరు మంది అమ్మాయిలు స్కార్ఫ్తో కాలేజీకి వచ్చారు. అయితే క్యాంపస్లో హెడ్స్కార్ఫ్ ఉన్నా సమస్య కాదు, కానీ క్లాస్రూమ్కు మాత్రం స్కార్ఫ్ లేకుండా రావాలని ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారమే తాము స్కార్ఫ్ ధరిస్తున్నట్లు ఆ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ కాలేజీలో ప్రతిష్టంభన మొదలైంది. ఇప్పుడు ఇదే సమస్య ఆ రాష్ట్రంలోని ఇతర కాలేజీలకు పాకింది. అబ్బాయిలు కాషాయ కండువాతో కాలేజీకి వెళ్లడం నిరసనలో భాగమైంది.
#WATCH | Protests erupt at Mahatma Gandhi Memorial College in Udupi as students wearing hijab & another group of students wearing saffron stoles-headgears raise slogans on college campus.
Karnataka HC to hear a plea today against hijab ban in several junior colleges of state. pic.twitter.com/f65loUWFLP
— ANI (@ANI) February 8, 2022