నాగారం, మార్చి 10 : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫణిగిరి బౌద్ధక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని బుద్ధవనం ప్రాజెక్టు డైరెక్టర్ మల్లెపల్లి లక్ష్మయ్య తెలిపారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఫణిగిరి, వర్ధ్దమానుకోట గ్రామాల్లో బుద్ధుడి ఆనవాళ్లు, ఆరామాలను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశాల మేరకు గురువారం ఆయన పరిశీలించారు. ఈ ప్రాంతాలను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్టు తెలిపారు. నాడు లభ్యమైన బుద్ధుడి ఆనవాళ్లు, స్తూపాలు, మ్యూజియాన్ని తిలకించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఫణిగిరి క్షేత్రంలో ఉన్నాయన్నారు. ఆయన వెంట చరిత్రకారుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, ఓఎస్డీ సుందన్రెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.
మారేడ్పల్లి, మార్చి 10: ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను ఇటీవలే పూర్తి చేసి.. ఉద్యోగంలో చేరిన హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు అక్కడి స్విమ్మింగ్పూల్లో ముని గి మరణించారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ ప్రాంతానికి చెందిన ఆర్ శ్రీనివాస్, అరుణ దంపతుల కుమారుడు సాయి సూర్యతేజ ఎంఎస్ కోసం 2019లో ఆస్ట్రేలియా వెళ్లారు. రెండు నెలల క్రితం చదువు పూర్తికావడంతో సివిల్ ఇంజనీర్గా అక్కడే ఉద్యోగంలో చేరారు. ఈ నెల 7న ఆస్ట్రేలియా లల తాను నివాసం ఉండే గోల్డెన్ కాస్ట్ రిసార్ట్లోని సిమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తు పడిపోయి మరణించారు.