వైస్ చాన్స్లర్ ప్రవీణ్రావు
వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 27: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఏ గ్రేడ్ దక్కింది. దాని పరిధిలోని అన్ని కళాశాలలు అందిస్తున్న నాలుగు అండర్గ్రాడ్యుయేట్, 18 పోస్టు గ్రాడ్యుయేట్, 13 డాక్టోరల్ ప్రోగ్రామ్స్కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్కి చెందిన నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రెడిటేషన్ బోర్డు 2021 డిసెంబర్లో ఏ గ్రేడ్ ఇచ్చిందని ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని పరిశోధనలు సాగించేలా ఫ్యాకల్టీని, విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. వ్యవసాయ విద్యపై పెరుగుతున్న మక్కువను దృష్టిలో పెట్టుకొని గత కొన్నేండ్లుగా వర్సిటీలో సీట్ల సంఖ్యను పెంచుతూ వస్తున్నామని పేర్కొన్నారు.