హైదరాబాద్: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తన కూతురు మాల్తీ మేరి ఫోటోను తొలిసారి రిలీజ్ చేసింది. మదర్స్ డే సందర్భంగా తన భర్త నిక్ జోన్స్తో కలిసి దిగిన ఫోటోను ఆమె షేర్ చేసింది. ఆ ఫోటోలో ప్రియాంకా తన చేతుల్లో మాల్తీని ఎత్తుకుని ఉంది. ఫోటోతో పాటు ఓ భారీ సందేశాన్ని కూడా రాసిందామె. ఎట్టకేలకు నా చిన్నారి ఇంటికి వచ్చిదంటూ ప్రియాంకా తన ఉత్సాహాన్ని చాటుకున్నది. సరోగసీ ద్వారా ప్రియాంకా కుమార్తెకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
అయితే గడిచిన వంద రోజుల నుంచి ఆ శిశువు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది. ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ జర్నీ ప్రత్యేకంగా ఉంటుందని, ఒక స్థిరమైన నమ్మకం కావాలని, గత కొన్ని నెలలు తాము కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నామని, కానీ ప్రతి క్షణం ఎంత విలువైందో అప్పుడే తెలుస్తుందని ఆమె తన పోస్టులో రాశారు. తన కూతురు క్షేమం కోసం నిరంతరం శ్రమించిన డాక్టర్లు, హాస్పిటల్ నర్సులకు ఆమె థ్యాంక్స్ చెప్పింది. లాస్ ఏంజిల్స్లోని రాడీ చిల్డ్రన్స్ లా జోలా అండ్ సిడార్ సినాయ్ ఆస్పత్రిలో మాల్తీ చికిత్స పొందింది. మమ్మీ డాడీ లవ్ యూ అంటూ ప్రియాంకా తన పోస్టులో సంతోషాన్ని వ్యక్తం చేసింది.