Priyank Kharge : తనకు మనువాదుల నుంచి ఇటీవల బెదిరింపు లేఖ వచ్చిందని కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే గురువారం వెల్లడించారు. దళితులు రాజకీయాల్లో ఉండరాదని ఈ లేఖలో బెదిరించారని దుయ్యబట్టారు. కలబురగిలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగాలని స్ధానిక ఎంపీ చెబుతున్నారని, సీబీఐ, ఈడీ, ఐటీ, ఈసీ వంటి యంత్రాంగమంతా వారి గుప్పిట్లోనే ఉంటే ఇంకా ఆయనకున్న అభ్యంతరాలేంటో తనకు అర్ధం కావడం లేదని బీజేపీ తీరుపై ప్రియాంక్ ఖర్గే విరుచుకుపడ్డారు.
ఇక తనకు ఇటీవల మరో బెదిరింపు లేఖ వచ్చిందని దళితులు రాజకీయాల్లోకి రాకూడదని, సమాజంలో పైకి ఎదగకూడదని, మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని మేం ఎన్కౌంటర్ చేస్తామని లేఖలో బెదిరించారని ఖర్గే వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు.
కర్నాటకలోని 28 లోక్సభ స్ధానాలకు ఏప్రిల్ 26, మే 7న రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 26 స్ధానాల్లో గెలుపొందగా కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కో స్ధానానికి పరిమితమయ్యాయి. ఇక ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
Nijjar Murder Case | నిజ్జార్ హత్య దర్యాపుపై స్పందించిన కెనడా ప్రధాని ట్రుడో..!