హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 ప్రయాణికులు ఉన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.