కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ సినిమా తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ తన కూతురును సంరక్షించుకునేందుకు పడే తపన ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్నకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ను ఆకర్షించింది. హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా రీమేక్ అవుతున్నది. ఈ విషయం గతంలోనే ప్రకటించినా…ఇటీవల సినిమా పేరును ఖరారు చేశారు. ‘భోలా’ టైటిల్తో సినిమాను పునర్నిర్మిస్తున్నారు. అజయ్ దేవగణ్ సోషల్ మీడియా ద్వారా టైటిల్ను ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 30న సినిమాను విడుదల చేయబోతున్నారు. కీలక పాత్రలో టబూ నటించనుంది. ధర్మేంద్ర శర్మ దర్శకుడు. అజయ్ దేవగణ్ ఫిలింస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.