నల్లగొండ : అమరవీరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణ ను అవమాన పరుచడంపై సీపీఐ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో నల్లగొండలో సుభాష్ విగ్రహం వద్ద మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లి కంటి సత్యం మాట్లాడుతూ.. తెలంగాణ పట్ల బిజెపి ద్వంద నీతో వ్యవహరిస్తూ ప్రత్యేక తెలంగాణకు అనుకూలమని చెబుతూనే అనేక సందర్భంలో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా గాని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ హామీలు అమలు కాలేదన్నారు. పార్లమెంటులో తెలంగాణ విభజన పట్ల అవమానకరంగా మాట్లాడిని ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ శ్రావణ్ కుమార్, పి వీరస్వామి, ప్రజా సంఘాల నాయకులు జి రామచంద్రన్, వెంకటేష్ గాదె, పాక రమేష్, లెనిన్, విగ్నేష్, నాగయ్య, జమీల్ మదర్ తదితరులు పాల్గొన్నారు.