చార్మినార్, నవంబర్ 30 : విపత్తులు సంభవించినప్పుడు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ జాఫరుల్ ఇస్లాం తెలిపారు. మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులతో సాలార్జంగ్ మ్యూజియంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ముందస్తుగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేంధర్రెడ్డి, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ అర్వింద్, మహేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.