భాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ పతాకంపై దర్శకుడు ప్రశాంత్నీల్ రూపొందిస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్నదీ సినిమా. భావోద్వేగాలతో కూడిన భారీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ‘సలార్’ ఈ ఏడాది చివరికైనా తెరపైకి వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే తాజా సమాచారం మేరకు ప్రభాస్ కొత్త సినిమా వచ్చే ఏడాది వేసవికి గానీ విడుదల అయ్యేట్లు కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఈ సినిమా ఒక వంతు మాత్రమే చిత్రీకరణ జరుపుకొన్నదని, మిగతా షూటింగ్ జరిపేందుకు చాలా సమయం కావాల్సిఉందని తెలుస్తున్నది. మే నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించి ఏడాది చివరకు షూటింగ్ మొత్తం పూర్తి చేయనున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, ప్రచార సమయం కలుపుకొంటే మరో ఐదారు నెలలు పడుతుంది. దీంతో వచ్చే ఏడాది వేసవికే ప్రభాస్ ప్రేక్షకులను పలకరించే అవకాశముంది. ఇక ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న సినిమా సూపర్ నాచురల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఉండబోతున్నదట.