హుయెల్వా (స్పెయిన్): భారత యువ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో బోణీ కొట్టాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 13-21, 21-18, 21-19తో లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. మెగాటోర్నీలో ఇప్పటికే లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్కు చేరగా.. ఇప్పుడు ప్రణయ్ కూడా ముందంజ వేశాడు. మరో మ్యాచ్లో సాయిప్రణీత్ సాయిప్రణీత్ 21-17, 7-21, 18-21తో మార్క్ కాల్జో (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి పాలయ్యాడు. సోమవారం గంటా 11 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ప్రణయ్ పోరాడి నెగ్గాడు. తొలి గేమ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన తెలుగు ప్లేయర్.. ఆ తర్వాత వరుస గేమ్ల్లో విజృంభించాడు. పురుషుల డబుల్స్లో అర్జున్-ద్రువ్జోడీ తొలి రౌండ్లో విజయం సాధించగా.. అరుణ్-సాన్యం శుక్లా జంట ఓటమి పాలైంది మిక్స్డ్ డబుల్స్లో జూహీ దేవాంగన్-వెంకట్ గౌరవ్ ప్రసాద్ జోడీ నిరాశ పరిచింది.