న్యూఢిల్లీ: చైనాలో భారత రాయబారిగా సీనియర్ దౌత్యాధికారి ప్రదీప్ కుమార్ రావత్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సోమవారం భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 1990 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ప్రదీప్ రావత్.. ప్రస్తుతం నెదర్లాండ్లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయనను చైనాలో రాయబారిగా నియమించినందున త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుతం చైనా రాయబారిగా విక్రమ్ మిస్రీ పనిచేస్తున్నారు. ఆయన నుంచి ప్రదీప్ రావత్ బాధ్యతలు తీసుకోనున్నారు. తూర్పు లఢఖ్లో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రదీప్ రావత్ చైనాలో భారత రాయబారిగా బాధ్యతలు చేపడుతున్నారు. కాగా ప్రదీప్ రావత్ గతంలో హాంకాంగ్, బీజింగ్లలో దౌత్యాధికారిగా పనిచేశారు. అంతేగాక 2017 సెప్టెంబర్ నుంచి 2020 డిసెంబర్ వరకు రావత్ ఇండోనేషియా, తైమూర్ లెస్తే దేశాల్లో భారత రాయబారిగా కూడా సేవలందించారు. ఆయన చైనా భాషను అనర్గలంగా మాట్లాడగలరు.