ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. కె.కె.రాధాకృష్ణకుమార్ దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకులముందుకు రానుంది. పూజాహెగ్డే కథానాయిక. ఈ సినిమా తాలూకు కొత్త పోస్టర్ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో ప్రభాస్, పూజాహెగ్డే ప్రణయభావాల్ని పలికిస్తూ ్త అందంగా కనిపిస్తున్నారు. నేడు ఈ సినిమా నుంచి రెండోగీతం ‘నగుమోము తారలే’ విడుదలకానుంది. ‘ప్రేమికుల మనోభావాలకు అద్దం పడుతూ ఈ పాట అందరిని మెప్పిస్తుంది. ఈ గీతానికి జస్టిన్ ప్రభాకరన్ స్వరాల్ని అందించారు. ‘ఇటలీ నేపథ్యంలో సాగే వింటేజ్ ప్రేమకథా చిత్రమిది. భవిష్యత్తును ఊహించే విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ వైవిధ్యంగా కనిపిస్తారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్లుక్, పాటకు మంచి స్పందన లభిస్తున్నది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, సచిన్ఖేడ్కర్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్పరమహంస, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ, నిర్మాణ సంస్థలు: గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కె.కె.రాధాకృష్ణకుమార్.