న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది పవర్గ్రిడ్ కార్పొరేషన్. ప్రతిషేరుకు రూ.5.5 చొప్పున చెల్లించనున్నట్టు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 2.21 శాతం తగ్గి రూ.3,292.97 కోట్లకు పరిమితమైనట్లు తెలిపింది. అంతక్రితం ఇది రూ.3,367.71 కోట్లుగా ఉన్నది. ఆదాయం మాత్రం మూడు శాతం పెరిగి రూ.10,142. 48 కోట్ల నుంచి రూ.10,446.88 కోట్లకు ఎగబాకింది.