‘రంగస్థలం’చిత్రంలో ‘జిగేలు రాణి..’ఐటెంసాంగ్తో కుర్రకారులో జోష్ను నింపింది మంగళూరు సోయగం పూజాహెగ్డే. తాజాగా ఈ భామ ‘ఎఫ్-3’చిత్రంలో ప్రత్యేక గీతంలో నటిస్తున్నది. ఈ పాట తాలూకు షూటింగ్ శుక్రవారం హైదరాబాద్లో మొదలైంది. కళా దర్శకుడు ఏ.ఎస్.ప్రకాష్ ఆధ్వర్యంలో రూపొందించిన సెట్లో ఈ పాటను తెరకెక్కిస్తున్నారు. ఈ పార్టీసాంగ్లో చిత్ర హీరోలు వెంకటేష్, వరుణ్తేజ్తో పాటు కథానాయికలు తమన్నా, మెహరీన్, సోనాల్చౌహాన్ పాల్గొంటున్నారు. ఈ స్పెషల్సాంగ్ కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఓ హుషారైన బాణీ సిద్ధం చేశారని..సినిమాలో ఈ గీతం ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ‘ఎఫ్-3’చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకురానుంది. రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్చౌహాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సహనిర్మాత: హర్షిత్ రెడ్డి, దర్శకత్వం: అనిల్ రావిపూడి.