హైదరాబాద్/సుల్తాన్బజార్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్చంద్రశర్మ విజ్ఞప్తి చేశారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు నిర్దిష్టమైన వ్యవస్థ అవసరమని ఉద్ఘాటించారు. ఆదివారం ఆయన రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ (టీఎస్పీసీఏ) చైర్మన్ జస్టిస్ ప్రకాశ్రావుతో కలిసి నాం పల్లి గగన్విహార్లోని అథారిటీ నూతన కా ర్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జస్టిస్ సతీశ్చంద్రశర్మ మాట్లాడు తూ.. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ అందమైన హుస్సేన్సాగర్ ఉన్నదని ఎంతో గొప్పగా విన్నానని, తీరా అక్కడికి వెళ్లాక కనీసం 5 నిమిషాలు కూడా నిలబడలేకపోయానని చెప్పారు. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదన్నారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ నీతూకుమారి ప్రసాద్ మాట్లాడుతూ.. బోర్డు కార్యకలాపాలు, పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను వివరించారు. జన జీవనాని కి, సముద్ర పర్యావరణ వ్యవస్థకు ముప్పుగా మారిన గ్రీన్హౌస్ వాయువులను పూర్తిగా నియంత్రించాల్సిన అవసరమున్నదని టీఎస్పీసీఏ చైర్మన్ జస్టిస్ బీ ప్రకాశ్రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్పీసీఏ సభ్యులు వీ జయతీర్థరావు, వీ ప్రభాకర్రెడ్డి, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, పర్యావరణ చీఫ్ ఇంజినీర్, సీవై నగేశ్ పాల్గొన్నారు.