ముంబై: మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సంక్షోభం వల్ల విధాన సభను రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు ఇవాళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తన ట్విట్టర్లో తెలిపారు. రాజకీయ సంక్షోభం కొలిక్కి వచ్చే సూచనలు కనిపించకపోవడం వల్ల అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు రౌత్ అభిప్రాయపడ్డారు. రౌత్ ట్వీట్తో మహారాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఉద్దవ్ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
महाराष्ट्रातील राजकीय घडामोडींचा प्रवास विधान सभा बरखास्तीचया दिशेने..
— Sanjay Raut (@rautsanjay61) June 22, 2022
శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే సుమారు 46 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుకు దిగిన విషయం తెలిసిందే. అయితే శివసేన పార్టీ నుంచి తానేమీ వెళ్లడం లేదని, కానీ బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వ వాదాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు.ఏక్నాథ్ తిరుగుబాటుతో మహా వికాశ్ అగధి కూటమి కుదేలైంది. సీఎం ఉద్దవ్ అసెంబ్లీని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఠాక్రే వైపు ఇంకా 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.