శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ఆర్నియాలో డ్రోన్ కలకలం సృష్టించింది. ఆర్నియాలోని తోప్ గ్రామంలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఓ డ్రోన్ ఎగరడాన్ని భద్రతాబలగాలు గుర్తించాయి. దానిపై జవాన్లు కాల్పులు జరపడంతో అది పాకిస్థాన్ వైపు వెళ్లిపోయింది. ఆ ప్రాంతంలో గాలించగా.. ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించాయి. అప్పటికే ఆ డ్రోన్ ఆయుధాలను, పేలుడు పదార్థాలతో కూడిన ఓ ప్యాకెట్ను అక్కడ వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. బాంబు డిస్పోజల్ బృందం వచ్చి దానిని తెరిచిందని, అందులో ఓ రైఫిల్, పిస్తోల్, కొన్ని మ్యాజీన్లు, గ్రనేడ్లు లభించాయని చెప్పారు. ఫిబ్రవరి 24న పాకిస్థాన్ డ్రోన్ ఆయుధాలను వదిలివెళ్లిన ఘటనకు సంబంధించి ఆర్నియా పోలీస్ స్టేషన్ ఓ కేసు నమోదయిందని వెల్లడించారు.