న్యూఢిల్లీ : సాంగ్ను ప్లే చేయాలని డీజేను కోరిన ఆర్మీలో పనిచేసే ఓ వ్యక్తిని కొట్టిన నలుగురు బౌన్సర్లలో ఓ నిందితుడిని గురుగ్రాం పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్టార్ 29లో ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ క్లబ్ వెలుపల ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నలుగురు బౌన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బౌన్సర్లు ఆర్మీలో పనిచేసే వ్యక్తి సహా ఆయన ఇద్దరు సోదరులపైనా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షుల్లో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ముగ్గురు సోదరులను వారు చితకబాదుతూ కనిపించారు. వారిని విడిచిపెట్టాలని పోలీసులు కోరడంతో నిందితులు పరారయ్యారు. ఈ ఘటనపై రోహ్తక్కు చెందిన నాయక్ సునీల్ కుమార్ ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్టీ చేసుకునేందుకు ఆదివారం రాత్రి నాయక్ సునీల్ కుమార్, ఆయన సోదరులు ఖాజా సింగ్, అనిల్ కుమార్లతో కలిసి సునీల్ ఫ్రిక్షన్ క్లబ్కు వెళ్లారు. అక్కడ పాటలకు డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేశామని ఒక్కసారిగా పాట ఆగిపోతే మ్యూజిక్ స్టార్ట్ చేయాలని తమ సోదరుడు అనిల్ కోరాడని చెప్పారు. సాంగ్ ప్లేయాలని తన సోదరుడు అనిల్ కోరగా నలుగురు బౌన్సర్లు తమను చుట్టుముట్టి బార్ బయటకు తీసుకువెళ్లి కర్రలతో కొట్టారని చెప్పారు. మరోసారి క్లబ్కు వస్తే మిమ్మల్ని చంపేస్తామని వారు తమను బెదిరించారని వెల్లడించారు.