హల్దిరామ్ ఉత్పత్తులపై తేదీల తొలగింపు
కొత్తగా స్టాంప్వేసి మళ్లీ మార్కెట్లోకి విడుదల
డిస్ట్రిబ్యూటర్ను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): హల్దిరామ్ సంస్థకు చెందిన తినుబండారాల ప్యాకెట్లపై గడువు తేదీని మార్చి, మార్కె ట్లో విక్రయిస్తున్న డిస్ట్రిబ్యూటర్ను లంగర్హౌస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం వెస్ట్జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. లంగర్హౌస్ బాపూనగర్కు చెందిన కోమటి లక్ష్మీనారాయణ అలియాస్ లక్ష్మణ్ పదేండ్లుగా హల్దిరామ్ తినుబండాలకు సబ్ డిస్ట్రిబ్యూటర్. బాపూనగర్లో జై శ్రీరామ్ ఏజెన్సీ పేరుతో షాప్, గోదాం నిర్వహిస్తున్నాడు. హల్దిరామ్ ఉత్పత్తులైన తినుబండారాల ప్యాకెట్లపై గడువు (ఎక్స్పైరీ) తేదీ ఉంటుంది. 2018 నవంబర్లోనే గడువు ముగిసిన ప్యాకెట్ల సేకరిం చి ఆ తేదీలను తొలగించి, 2021 జూలై వరకు గడువు ఉన్నట్టుగా రబ్బర్ స్టాంప్లతో ముద్రిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో గోదాంపై దా డిచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిం ది. నిందితుడి నుంచి రూ.1.5 లక్షల విలువైన హల్దిరామ్ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. 2019 నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.