న్యూయార్క్: మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలోని చక్కెర స్థాయిల ను మరింత సులభంగా తెలుసుకునే పరికరం వచ్చింది. ఇన్ట్యుటీ సర్జికల్ కంపెనీ ‘పోగో’ పేరిట ఈ ఆటోమేటిక్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. షుగర్ స్థాయిని తెలుసుకునేం దుకు ఇప్పటివరకూ వినియోగిస్తున్న లాన్సెట్స్ (రక్త నమూనాలు), టెస్ట్ స్ట్రిప్స్ (వేళ్లకు పట్టీలు అమర్చడం) వంటి కష్టమైన ప్రక్రియలు అవసరం లేకుండానే 4 సెకండ్లలోనే ఫలితాలను ఇచ్చేలా ఈ డివైజ్ను తయారు చేశారు. ‘పోగో’ మీదనున్న బటన్ను నొక్కగానే శరీరంలోని చక్కెర స్థాయిలను ఈ డివైజ్ డిస్ప్లే చేస్తుంది. యాప్ సాయంతో ఈ డాటాను వైద్యులకు కూడా చేరవేస్తుంది. ఎఫ్డీఏ అనుమతి పొందిన తొలి ఆటోమేటిక్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ ఇదే.