ఢిల్లీ ,జూన్ 22: జూన్ 24న జరిగే టాయికథాన్-2021లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించనున్నారు. ఆట వస్తువులను, ఆటలకు సంబంధించిన ఆలోచనలను వివిధ సమూహాల ద్వారా సమకూర్చడం కోసం టాయికథన్-2021ను ఈ సంవత్సరం జనవరి 5న కేంద్ర విద్య శాఖ, మహిళ, శిశు సంక్షేమ శాఖ, ఎమ్ఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ, డిపిఐఐటి, జౌళి మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ లతో పాటు, ఎఐసిటిఇ లు కలసి మొదలు పెట్టాయి.
టాయికథన్-2021 లో పాలుపంచుకొనేందుకు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1.2 లక్షల మంది ముందుకు వచ్చి నమోదులు చేసుకొని, 17,000కు పైగా ఐడియాలు అందించారు. వాటిలో నుంచి 1567 ఐడియాలను జూన్ 22 మొదలుకొని జూన్ 24 వరకు ఆన్లైన్ మాధ్యమం ద్వారా నిర్వహించే టాయికథన్ గ్రాండ్ ఫినాలే కోసం ఎంపిక చేశారు. భారతదేశంలోని ఆటవస్తువుల తయారీ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని అందించి, ఆ పరిశ్రమ ఆటబొమ్మల బజారులో ఒక విస్తృతమైన వాటాను చేజిక్కించుకోవడంలో సాయపడాలి అనేది టాయికథన్-2021 ధ్యేయం.