హర్దోయ్: యూపీలోని హర్దోయ్లో ఆదివారం ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా తీర్పు వచ్చిన అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల ఘటన గురించి ఆయన మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీ ఎన్నికల గుర్తు ‘సైకిల్’ను ప్రస్తావించారు. 2008లో చోటుచేసుకొన్న పేలుళ్లకు ఉగ్రవాదులు సైకిళ్లను వినియోగించారని, వారు సైకిళ్లను ఎందుకు ఎంచుకున్నారో ఆశ్చర్యంగా ఉన్నదని పేర్కొంటూ ఎస్పీ గుర్తుకు అన్వయించే ప్రయత్నం చేశారు.