విభజన సూత్రం మన దేశ ప్రజల లక్షణం కానేకాదు. అందరినీ కలుపుకొని వెళ్లాలనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని మేము అనుసరిస్తాం. కొందరు భిన్నత్వ భావనను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. 50 ఏండ్లలో కాంగ్రెస్ దేశాన్ని విభజించడానికి మాత్రమే పనిచేసింది. రాష్ర్టాల అవసరాలు, ఆకాంక్షలు నాకు బాగా తెలుసు. ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చడాన్ని బీజేపీ బలంగా విశ్వసిస్తుంది.
లోక్సభలో నెహ్రూ పేరును తెస్తే కాంగ్రెస్ వాళ్లకు ఏంటి ఇబ్బంది? నేను ఏ ఒక్కరి తండ్రి లేదా తాతగారి గురించి మాట్లాడలేదు. మాజీ ప్రధాని చెప్పిన విషయాన్నే చెప్పాను. ఈ విషయంలో వాళ్లు అంతగా ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదు. రైతుల క్షేమం కోసం సాగు చట్టాలు తీసుకొచ్చాం. అయితే అన్నదాతల డిమాండ్తో జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటిని వెనక్కి తీసుకొన్నాం.
-ప్రధాని నరేంద్రమోదీ