శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని జబర్వాన్ పర్వతప్రాంతంలో తులిప్ గార్డెన్ సందర్శకుల కోసం రేపు(గురువారం) తెరుచుకోనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అవకాశం దొరికనప్పుడల్లా ప్రతి ఒక్కరూ జమ్ముకశ్మీర్ను సందర్శించి సుందరమైన తులిప్ ఫెస్టివల్ను వీక్షించాల్సిందిగా దేశ ప్రజలను కోరారు. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంత ప్రజల ఆతిధ్యాన్ని చవిచూడాల్సిందిగా విన్నవించారు. ఈ తులిప్ ఫెస్టివల్లో 64 రకాల్లో 15 లక్షల పూలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి.