ధూంధాంగా టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ హైటెక్స్లో సోమవారం జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఆటపాటలతో దద్దరిల్లింది. ‘కోట్ల గొంతులను ఏకం చేసిందిరా జెండా.. కేసీఆర్ ఎగరేసినది ఈ గులాబీ జెండా.. చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా’ అంటూ సాగిన పాట సభా ప్రాంగణాన్ని ఉర్రూతలూగించింది. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంసృ్కతిక కార్యక్రమాలు ప్రతినిధుల్లో ఉత్సాహాన్ని నింపాయి. మధ్యాహ్న భోజన సమయంలోనూ ఆటపాటలతో కళాకారులు ఆకట్టుకున్నారు. వేదికపై కళాకారులను అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. త్వరలో కలుద్దామని వారితో చెప్పారు.