హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి ప్లాట్ఫాం టికెట్ ధరలను పెంచారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ఏపీ, కొల్లంకు ఇతర రైల్వే స్టేషన్లకు సాధారణ రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్ల రాకపోకలు అధికమయ్యాయి. దీంతో స్టేషన్లో రద్దీ పెరిగింది. రద్దీని తగ్గించేందుకు ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20 పెంచినట్టు అధికారులు ప్రకటించారు. త్వరలోనే మిగతా ప్రధాన స్టేషన్లలో ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లలో అధికారులు రక్షణ చర్యలను ముమ్మరంచేశారు. ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకొంటున్నారు. తరచూ చేతులు శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని చెప్తున్నారు. గుంపులుగా కాకుండా భౌతికదూరం పాటించాలంటూ ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు.