బిహార్, జార్ఖండ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఛట్ పూజ సందర్భంగా ఉదయం నుంచే నదుల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి సూర్య భగవానుడికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాధారణంగా దీపావళి పండుగ పూర్తయిన ఆరు రోజుల తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో భాగంగా 36 గంటల పాటు ఉపవాసం ఉంటారు. నదీ ఘాట్ల వద్ద స్నానం ఆచరించి.. అక్కడే దీపాలను వెలిగించి పూజలు చేస్తారు.