తెలుగుయూనివర్సిటీ, నవంబర్ 30 : కరోనా పరిస్థితిలో వైద్యుల సేవలకు వెలకట్టలేమని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. మెగాసిటీ నవకళా వేదిక 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సారస్వతి పరిషత్తు ప్రాంగణంలోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో వైద్యరంగంలో నిష్ణాతులైన ఉభయ తెలుగు రాష్ర్టాల వైద్య నిపుణులకు వైద్య శ్రీ-2021 అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ జి. చంద్రయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ జీవనాన్ని కొనసాగించాలని సూచించారు. సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు హరినాథబాబు, న్యాయవాదులు ఏవీ స్వామి, శ్రీనివాసాచారి, డాక్టర్ ఆశిష్చౌహాన్, మెగాసిటీ నవకళావేదిక వ్యవస్థాపకులు అక్కినేపల్లి మల్లికార్జునరావు పాల్గొన్నారు.