కామారెడ్డి : సదాశివనగర్ మండలం అమర్లబండకు చెందిన కుంట రతన్కుమార్ అనే రౌడీ షీటర్పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలో 12 నేరపూరిత కేసులు నమోదయ్యాయి. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ తీరు మార్చుకోకపోవడం, ప్రభుత్వ అధికారులు బెదిరించడం, కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రవర్తన మార్చుకోకపోతే పదే పదే నేరపూరిత చర్యలకు పాల్పడుతుండడంతో కఠిన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. రతన్ కుమార్పై పీడీ యాక్ట్ అమలులో భాగంగా నిందితుడిని చంచల్గూడ జైలుకు తరలించినట్లు ఎస్పీ వివరించారు.