పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఊతప్ప (1) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ శాంట్నర్ (9)ను యువ పేసర్ అర్షదీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. పవర్ప్లే చివరి ఓవర్లో బంతి అందుకున్న అతను రెండో బంతికే శాంట్నర్ను బోల్తా కొట్టించాడు. ఆఫ్స్టంప్ ఆవల అర్షదీప్ వేసిన బంతిని శాంట్నర్ ఆడాడు. ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది కానీ.. స్లిప్ ఫీల్డర్ లేకపోవడంతో బౌండరీ వెళ్లింది.
ఆ తర్వాతి బంతికే శాంట్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాళ్లపైకి వేసిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన శాంట్నర్ ఆఫ్సైడ్ జరిగాడు. అతని వెనుక నుంచి వెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో 30 పరుగుల వద్ద చెన్నై జట్టు రెండో వికెట్ కోల్పోయింది. పవర్ప్లే ముగిసే సరికి 32/2 స్కోరుతో నిలిచింది.