హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో అసోసియేషన్ నేతలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. టీచర్లకు హెల్త్కార్డులు జారీ చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు యాకమల్లు, ప్రధానకార్యదర్శి కొంతం నగేశ్ తెలిపారు.