పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటుడే కాదు మంచి గాయకుడు కూడా. ఇప్పటి వరకు తొమ్మిది పాటలు పాడిన పవన్ ప్రతి పాటతో అలరించాడు. తాజాగా మరో పాట పాడేందుకు సిద్దమయ్యాడని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు చిత్రంతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ అనే మలయాళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. మలయాళంలో బిజూ మీనన్, పృథ్వీ రాజ్ పోషించిన పాత్రలను తెలుగులో పవన్, రానా చేయనున్నారు. దీనికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఒరిజినల్ వర్షెన్లో బిజూ మీనన్, పృథ్వీ రాజ్ కలసి ఓ ప్రమోషనల్ సాంగ్ పాడగా, ఇప్పుడు తెలుగులో పవన్, రానా కలిసి పాడనున్నారని వార్తలు వస్తున్నాయి. థమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా కోసం ఏం పిల్లా మాటాడవా, తాటి చెట్టుఎక్కలేవు అనే పాటలు పాడగా, ఖుషీలో బాయ్ బాయ్ రే బంగారు రమణమ్మా, జానీలో నువ్వు సారా తాగుతవురన్నో, రావోయి మా ఇంటికి అనే పాటలు పాడారు. ఇక పంజాలో పాపారాయుడు అనే పాట, అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా, అజ్ఞాతవాసి చిత్రంలో కొడకా కోటీశ్వరరావు అనే పాటలకు తన గాత్రాన్ని అందించారు. ఈ పాటలన్నింటికి మంచి ఆదరణ లభించగా, మలయాళ రీమేక్ కోసం పవన్ పాడనున్న పాట ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందా ఫ్యాన్స్ భావిస్తున్నారు.