అమరావతి : ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం స్పందించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు అభినందనలు చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధులందరూ బలమైన పోరాటం చేశారంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల మేరకు 177 ఎంపీటీసీ, రెండు జడ్పీటీసీ స్థానాలను జనసేన అభ్యర్ధులు గెలిచారని సమాచారం ఉందన్నారు. ఈ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయన్న అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తమ దగ్గర ఉందన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ఫలితాలపై రెండు మూడు రోజుల్లో సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తాననని పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటనతో పాటు వీడియో సందేశాన్ని ట్వీట్ చేసింది.
పరిషత్ ఎన్నికల్లో జనసేన విజేతలకు అభినందనలు – JanaSena Chief Shri @PawanKalyan
— JanaSena Party (@JanaSenaParty) September 20, 2021
Video Link: https://t.co/yYJCIfN2L0 pic.twitter.com/RIaLs9fPEV
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో గెలుపొందిన జనసేన అభ్యర్థులకు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ అభినందనలు.#ZPTCMPTCResult pic.twitter.com/eZM6ekGVlj
— JanaSena Party (@JanaSenaParty) September 20, 2021