బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పట్నా పైరేట్స్ జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా 43-26 తేడాతో పుణెరి పల్టాన్పై ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు గెలుపును ఖాతాలో వేసుకున్న పట్నా 70 పాయింట్లతో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరోవైపు నాలుగు విజయాల తర్వాత పల్టాన్ తొలి ఓటమిని చవిచూసింది. పట్నా తరఫున గుమన్ (13 పాయింట్లు) సత్తా చాటగా.. సచిన్ (6 పాయింట్లు) రాణించాడు. పుణెరి జట్టులో అస్లామ్ ఇనామ్దర్ (9), మోహిత్ (6) మినహా ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు. దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ను 39-39 డ్రా చేసుకున్నాయి.