న్యూఢిల్లీ: సౌదీ అరేబియాకు చెందిన సుమారు 54 లక్షల విలువైన కరెన్సీ నోట్లను ఎయిర్పోర్ట్ అధికారులు సీజ్ చేశారు. ఓ ప్రయాణికుడు స్వీట్ బాక్సులో సౌదీ కరెన్సీని తీసుకువచ్చాడు. అయితే ఇందిరా గాంధీ విమానాశ్రయం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆ ప్రయాణికుడు చిక్కాడు. టర్మినల్ 3 వద్ద కస్టమ్స్ అధికారులు అతన్ని పట్టుకున్నారు. స్వీట్ బాక్సులో దాచిన సౌదీ నోట్లకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్యాకింగ్ బాక్సులోని ఓ లేయర్ కింద నోట్లను దాచిపెట్టారు. స్వీట్ బాక్సు లోపల ఉన్న విదేశీ కరెన్సీ నోట్లను సీఐఎస్ఎఫ్ దళాలు పసికట్టాయి.