గౌరవం లేనిచోట ఉండలేను
పార్టీ మార్పుపై త్వరలో ప్రకటిస్తా
పీసీసీ చీఫ్పై రాజగోపాల్ ఆగ్రహం
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆ పార్టీ పెద్దలపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. క్యారెక్టర్ లేని వ్యక్తికి రాష్ట్రంలో పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించారని మండిపడ్డారు. గౌరవం లేనిచోట తాను ఉండలేనని, పార్టీ మారే అంశంపై త్వరలోనే ప్రకటన చేస్తానని బుధవారం హైదరాబాద్లో తన మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ఎవరు పడితే వాళ్లకింద పనిచేయలేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తికి, క్యారెక్టర్, నైతిక విలువలు లేని వ్యక్తికి పార్టీ పెత్తనం ఇచ్చారని మండిపడ్డారు. రాజగోపాల్రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సైతం మొదటి నుంచి రేవంత్ను వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే.