Paris Olympics | పారిస్: మునుపెన్నడూ లేని విధంగా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్న పారిస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరంభ వేడుకలు జరిగే ఆరుగంటల పాటు పారిస్ నగరంతో పాటు దానికి ఆనుకుని ఉన్న 150 కిలోమీటర్ల ఏరియాను ‘నో ఫ్లై జోన్’గా ప్రకటిస్తున్నట్టు ఎయిర్పోర్ట్స్ డి పారిస్ చైర్మన్ అగస్టిన్ డి రొమనెట్ తెలిపారు.
ఈ మేరకు ఇప్పటికే విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేసినట్టు చెప్పారు. ఆరంభ వేడుకలను పారిస్ లోని సీన్ నది ఒడ్డున నిర్వహించనుండగా సుమారు 3 లక్షల 20 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.