చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకుడు. వనమాలి క్రియేషన్స్ పతాకంపై మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను ఇటీవల విడుదల చేశారు. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ టీజర్ ఆద్యంతం నవ్వుల్ని పంచింది. దర్శకుడు మట్లాడుతూ ‘క్రైమ్ కామెడీ కథాంశమిది. వినోదంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.
సునీల్ పండించే హాస్యం హైలైట్గా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు మంచి స్పందన లభిస్తున్నది. ఏప్రిల్ 19న విడుదల చేస్తున్నాం’ అన్నారు. మాళవిక సతీషన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాలసరస్వతి, సంగీతం: రీ, రచన-దర్శకత్వం: సంతోష్ కంభంపాటి.